కరోనా నేపథ్యంలో మెడికల్ కౌన్సిల్ సంచలన నిర్ణయం...

ABN , First Publish Date - 2020-09-23T13:52:21+05:30 IST

కరోనా వ్యాప్తి నేపథ్యంలో దేశంలో పీజీ వైద్యవిద్యార్థుల విషయంలో మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా (ఎంసీఐ) సంచలన నిర్ణయ...

కరోనా నేపథ్యంలో మెడికల్ కౌన్సిల్ సంచలన నిర్ణయం...

పీజీ వైద్య విద్యార్థులు 3నెలలు జిల్లా ఆసుపత్రుల్లో పనిచేయాలి

న్యూఢిల్లీ : కరోనా వ్యాప్తి నేపథ్యంలో దేశంలో పీజీ వైద్యవిద్యార్థుల విషయంలో మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా (ఎంసీఐ) సంచలన నిర్ణయం తీసుకుంది. 2020-21 విద్యా సంవత్సరం నుంచి డాక్టర్ ఆఫ్ మెడిసిన్, మాస్టర్ ఇన్ సర్జరీ చదువుతున్న వైద్యవిద్యార్థులందరూ తమ అధ్యయనంలో భాగంగా జిల్లా ఆసుపత్రుల్లో మూడు నెలలపాటు వైద్యసేవలు తప్పనిసరిగా చేయాలని ఎంసీఐ బోర్డు నిర్ణయించింది. 


‘‘అన్ని పోస్ట్ గ్రాడ్యుయేట్ ట్రైనీలు లేదా మూడేళ్ల ఎండీ లేదా ఎంఎస్ కోర్సును అభ్యసించే వారు రెండవ సంవత్సరంలో లేదా మూడవ సంవత్సరం ప్రారంభంలో మూడు నెలలు జిల్లా ఆసుపత్రుల్లో పనిచేయాలి. ఎంసీఐ నిబంధనల ప్రకారం ఇది పీజీ వైద్యవిద్యార్థుల శిక్షణలో తప్పనిసరి ’’ అని ఎంసిఐ ఛైర్మన్ డాక్టర్ వీకే పాల్ చెప్పారు. పీజీ వైద్యవిద్యార్థులు మూడు నెలలు జిల్లా ఆసుపత్రుల్లో పనిచేయాలనే నిబంధన విధించడం మంచి ఆలోచన అని ఆల్ ఇండియా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ మాజీ డీన్ డాక్టర్ వీకే బాహ్ల్ చెప్పారు. 

Updated Date - 2020-09-23T13:52:21+05:30 IST