ప్రజల అవస్థలు ఇప్పటికైనా తీర్చండి

ABN , First Publish Date - 2021-12-01T06:29:33+05:30 IST

కొద్దిపాటి వర్షానికే గన్నవరం వాగు పారుతుంటే గండ్లోపల్లి, చెన్నంపల్లి గ్రామాలకు అంతరాయం ఏర్పడుతున్నా ప్రజా నాయకులు పట్టీపట్టనట్లు వ్యవహరిస్తున్నారని టీడీపీ మండల అధ్యక్షుడు ముత్తిరెడ్డి వెంకటరెడ్డి అన్నారు.

ప్రజల అవస్థలు ఇప్పటికైనా తీర్చండి
బ్రిడ్జి వద్ద నిరసన తెలుపుతున్న టీడీపీ నాయకులు

ప్రజల అవస్థలు ఇప్పటికైనా తీర్చండి

వెలిగండ్ల, నవంబరు 30: కొద్దిపాటి వర్షానికే గన్నవరం వాగు పారుతుంటే గండ్లోపల్లి, చెన్నంపల్లి గ్రామాలకు అంతరాయం ఏర్పడుతున్నా ప్రజా నాయకులు పట్టీపట్టనట్లు వ్యవహరిస్తున్నారని టీడీపీ మండల అధ్యక్షుడు ముత్తిరెడ్డి వెంకటరెడ్డి అన్నారు. మంగళవారం బ్రిడ్జి వద్ద టీడీపీ నాయకులు నీటిలో దిగి గ్రామాల ప్రజల సమస్యలు తీర్చాలని నిరసన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా పాలకులు బ్రిడ్జి నిర్మించి సమస్యను తీర్చాలని డిమాండ్‌ చేశారు. కార్యక్రమంలో కొండు భాస్కర్‌రెడ్డి, గొరిగే సుబ్రహ్మణ్యం, మీనగ కాశయ్య, వెంకటేశ్వర్లు, మాల్యాద్రి, సాల్మన్‌రాజు, కార్యకర్తలు పాల్గొన్నారు.

Updated Date - 2021-12-01T06:29:33+05:30 IST