రూ.3 లక్షల బంగారు మాస్క్.. సేఫ్టీ మాత్రం డౌటేనట!

ABN , First Publish Date - 2020-07-04T18:45:37+05:30 IST

పుర్రెకో బుద్ధి, జీహ్వకో రుచి అన్నారు. కరోనా మహమ్మారి నుంచి ప్రాణాలు కాపాడుకునేందుకు మార్కెట్లో మాస్కులు

రూ.3 లక్షల బంగారు మాస్క్..  సేఫ్టీ మాత్రం డౌటేనట!

పుణే: పుర్రెకో బుద్ధి, జీహ్వకో రుచి అన్నారు. కరోనా మహమ్మారి నుంచి ప్రాణాలు కాపాడుకునేందుకు మార్కెట్లో మాస్కులు దొరికితే చాలనుకుంటున్న ప్రస్తుత పరిస్థితుల్లో... ఓ వ్యక్తి తనకోసం ఏకంగా రూ. 2.89 లక్షల విలువ చేసే బంగారు మాస్కు తయారుచేసుకున్నాడు. మహారాష్ట్రలోని పింప్రి-చింద్వాడ్ వాసి శంకర్ కురాడే చేసిన ఈ వినూత్న ప్రయత్నం ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ‘‘శ్వాస తీసుకోవడానికి ఇబ్బంది లేకుండా దీనికి సూక్ష్మ పరిమాణంలో రంధ్రాలు ఉన్నాయి. ఈ మాస్కు సమర్థంగా పనిచేస్తుందో లేదో మాత్రం నాకు తెలియదు...’’ అని శంకర్ పేర్కొన్నాడు. ఈ నెల 1 నాటికి పింప్రి-చింద్వాడ్ ప్రాంతంలో కొవిడ్-19 కేసుల సంఖ్య 3,284గా ఉంది. కరోనా కారణంగా ఇక్కడ 47 మంది ప్రాణాలు కోల్పోయారు. 

Updated Date - 2020-07-04T18:45:37+05:30 IST