అభివృద్ధి పనులు సకాలంలో పూర్తి చేయాలి

ABN , First Publish Date - 2020-12-03T04:42:16+05:30 IST

మండలంలోని ఆయా గ్రామాల్లో చేపడుతున్న అభివృద్ధి పనులను సకాలంలో పూర్తి చేయాలని జిల్లా పంచాయతీ అధికారి నారాయణరావు అన్నారు.

అభివృద్ధి పనులు సకాలంలో పూర్తి చేయాలి
సమావేశంలో మాట్లాడుతున్న జిల్లా పంచాయతీ అధికారి నారాయణరావు

- జిల్లా పంచాయతీ అధికారి నారాయణరావు

జైపూర్‌, డిసెంబరు 2: మండలంలోని ఆయా గ్రామాల్లో చేపడుతున్న అభివృద్ధి పనులను సకాలంలో పూర్తి చేయాలని జిల్లా పంచాయతీ అధికారి నారాయణరావు అన్నారు. బుధవారం మండల అభివృద్ది అధికారి కార్యాలయంలో ఆయా గ్రామ పంచాయతీల కార్యదర్శులతో, అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ డంపింగ్‌యార్డులు, శ్మశానవాటిక పనులు ఈ నెల 20వ తేదీలోగా పూర్తి చేయాలని ఆదేశించారు. ప్రతీ గ్రామ పంచాయతీలో నర్సరీల నిర్వహణలో భాగంగా మట్టి సేకరణ, బ్యాగు పిల్లింగ్‌, బ్యాగులలో విత్తనాలు నాటడం పనులను త్వరగా పూర్తి చేయాలన్నారు. పల్లె ప్రకృతి వనాల పనులను త్వరగా పూర్తి చేయాలని సూచించారు. గ్రామ పంచాయతీల్లో చెత్తాచెదారం ఎప్పటికప్పుడు తొలగించాలని ఆదేశించారు. సమావేశంలో డీఎల్‌పీవో ప్రభాకర్‌రావు, ఎంపీడీవో కే నాగేశ్వర్‌రెడ్డి, మండల పంచాయతీ అధికారి కె సతీష్‌కుమార్‌, పంచాయతీరాజ్‌ ఏఈ రవి, ఈజీఎస్‌ ఏపీవో బాలయ్య, తదితరులు పాల్గొన్నారు. 

Updated Date - 2020-12-03T04:42:16+05:30 IST