హైకోర్టు సీజేతో జిల్లా అధికారుల భేటీ

ABN , First Publish Date - 2021-10-13T06:21:34+05:30 IST

హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా నియమితులైన జస్టిస్‌ ప్రశాంత్‌కుమార్‌ మిశ్రాను మంగళవారం విమానాశ్రయంలో జిల్లా అధికారులు మర్యాద పూర్వకంగా కలిశారు.

హైకోర్టు సీజేతో జిల్లా అధికారుల భేటీ

హైకోర్టు ప్రధాన న్యాయమూర్తితో జిల్లా ప్రధాన న్యాయమూర్తి, ఇతర అధికారులు 

హైకోర్టు సీజేతో జిల్లా అధికారుల భేటీ 


విశాఖపట్నం, అక్టోబరు 12: హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా నియమితులైన జస్టిస్‌ ప్రశాంత్‌కుమార్‌ మిశ్రాను మంగళవారం విమానాశ్రయంలో జిల్లా అధికారులు మర్యాద పూర్వకంగా కలిశారు. ప్రమాణ స్వీకారానికి ఒడిశా నుంచి విజయవాడ బయలుదేరిన ఆయన కొద్దిసేపు ఇక్కడ ఆగారు. ఈ సందర్భంగా జిల్లా ప్రధాన న్యాయమూర్తి అవధానం హరిహరనాథశర్మ, జిల్లా కలెక్టర్‌ ఎ.మల్లికార్జున, డీఐజీ ఎల్‌కేవీ రంగారావు, నగర పోలీస్‌ కమిషనర్‌ మనీష్‌ కుమార్‌ సిన్హా, జిల్లా ఎస్పీ బి.కృష్ణారావు, జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి కేకేవీ బులికృష్ణ ఆయనను కలసి అభినందించారు.

Updated Date - 2021-10-13T06:21:34+05:30 IST