12 గంటలకు మంత్రుల కమిటీ భేటీ, పీఆర్సీ స్టీరింగ్ కమిటీకి ఆహ్వానం

ABN , First Publish Date - 2022-01-25T15:24:30+05:30 IST

12 గంటలకు మంత్రుల కమిటీ భేటీ, పీఆర్సీ స్టీరింగ్ కమిటీకి ఆహ్వానం

12 గంటలకు మంత్రుల కమిటీ భేటీ, పీఆర్సీ స్టీరింగ్ కమిటీకి ఆహ్వానం

అమరావతి: మధ్యాహ్నం 12 గంటలకు సచివాలయంలో మంత్రుల కమిటీ సమావేశం కానుంది. సమావేశానికి రావాలని పీఆర్సీ స్టీరింగ్ కమిటీ సభ్యులకు మంత్రుల కమిటీ ఆహ్వానించింది. మంత్రుల కమిటీ భేటీకి వెళ్లేదే లేదంటుూ ఉద్యోగ సంఘాల నేతలు తేల్చి చెబుతున్నారు. పీఆర్సీ జీవోల రద్దు, మిశ్రా కమిటీ నివేదిక బహిర్గతం,.. పాత జీతాలు వేస్తేనే చర్చలకు వెళ్తామని ఇప్పటికే ఉద్యోగ సంఘాలు స్పష్టం చేశాయి. ఉదయం10 గంటలకు 11వ పీఆర్సీ సాధన సమితి స్టీరింట్ కమిటీ భేటీకానుంది. ప్రతినిధిని ద్వారా మంత్రుల కమిటీకి లేఖ పంపాలని నిర్ణయించారు.

Updated Date - 2022-01-25T15:24:30+05:30 IST