జూన్ 2న ఉద్యమకారులతో సమావేశం: BJP

ABN , First Publish Date - 2022-05-29T22:05:25+05:30 IST

Telangana: తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడుకలను పురస్కరించుకుని జూన్ 2న నాగోల్ జై కన్వెన్షన్ సెంటర్‌లో ఉద్యమకారులతో సమావేశం నిర్వహిస్తున్నామని బీజేపీ నేత జిట్టా

జూన్ 2న ఉద్యమకారులతో సమావేశం: BJP

Telangana: తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడుకలను పురస్కరించుకుని జూన్ 2న నాగోల్ జై కన్వెన్షన్ సెంటర్‌లో ఉద్యమకారులతో సమావేశం నిర్వహిస్తున్నామని బీజేపీ నేత జిట్టా బాలకృష్ణారెడ్డి తెలిపారు. ఈ కార్యక్రమం ద్వారా సీఎం కేసీఆర్‌కు వ్యతిరేకంగా ఉద్యమకారులందరిని ఏకతాటిపై తెస్తామన్నారు. మరో పోరాటానికి ఉద్యమకారులు సిద్ధం కావాలని పిలుపునిచ్చారు. కేసీఆర్ తీరు వల్ల ఎంతోమంది తెలంగాణ యువకులు ఆత్మహత్య చేసుకున్నారని బీజేపీ సీనియర్ నాయకుడు స్వామీగౌడ్ పేర్కొన్నారు. పార్టీలకు అతీతంగా ఉద్యమకారులు రావాలని కోరారు. ఉద్యమకారులను టీఆర్ఎస్ మర్చిపోయిందన్నారు.  బీజేపీ నాయకుడు కపిలవాయి దిలీప్ కుమార్  మాట్లాడుతూ..నీళ్లు, నిధులు, నియామకాల ట్యాగ్‌లైన్‌ను కేసీఆర్ మర్చిపోయారని విమర్శించారు. ఐటీ కేసులు ఉన్నవారికి పదవులు ఇచ్చి ఉద్యమ కారులను కేసీఆర్ పట్టించుకోకపోవడం దారుణమన్నారు.  

Updated Date - 2022-05-29T22:05:25+05:30 IST