విద్యార్థి సంఘాలతో సమావేశం: జగ్గారెడ్డి

ABN , First Publish Date - 2022-04-29T01:03:17+05:30 IST

ఏఐసీసీ నేత రాహుల్ గాంధీ రాష్ట్రంలో పర్యటించనున్న నేపథ్యంలో అన్ని

విద్యార్థి సంఘాలతో సమావేశం: జగ్గారెడ్డి

హైదరాబాద్: ఏఐసీసీ నేత రాహుల్ గాంధీ రాష్ట్రంలో పర్యటించనున్న నేపథ్యంలో అన్ని విద్యార్థి సంఘాలతో  శుక్రవారం గాంధీ భవన్‌లో సమావేశం నిర్వహిస్తామని  కాంగ్రెస్ ఎమ్మెల్యే జగ్గారెడ్డి తెలిపారు. నగరంలో ఆయన మీడియాతో మాట్లాడారు. తెలంగాణలో విద్యార్థులు అనేక సమస్యలు ఎదుర్కొంటున్నారన్నారు. ఓయూ విద్యార్థులతో రాహుల్ గాంధీ సమావేశం ఏర్పాటు చేయాలని పార్టీ నిర్ణయించిందని ఆయన తెలిపారు. దీని కోసం ఇప్పటికే ఓయూ వీసీని పర్మిషన్ అడిగామన్నారు. పర్మిషన్ అడిగి వారం అవుతున్నా వీసీ నుంచి ఎటువంటి సమాచారం రాలేదన్నారు. పర్మిషన్ ఇస్తే తాము మీటింగ్ ఏర్పాట్లు చేసుకోవాలన్నారు. కొంతమంది టీఆర్ఎస్ నాయకులు పర్మిషన్ ఇవ్వొద్దని వీసీపై ఒత్తిడి తెస్తున్నారని ఆయన ఆరోపించారు. ఓయూ వీసీ డమ్మీగా మారాడన్నారు. అన్ని విద్యార్ది సంఘాలతో  రేపు గాంధీ భవన్‌లో సమావేశం నిర్వహిస్తామన్నారు. ఒకటి రెండు రోజుల్లో వీసీ పర్మిషన్ ఇస్తాడని ఆశిస్తున్నామని ఆయన పేర్కొన్నారు. 

Updated Date - 2022-04-29T01:03:17+05:30 IST