29న మెగా బ్యాంకు రుణమేళా
ABN , First Publish Date - 2021-10-26T05:30:00+05:30 IST
జిల్లాలోని అన్ని బ్యాంకులు సంయుక్తంగా మెగా రుణ మేళాను ఈ నెల 29న నిర్వహించనున్నాయి.
కర్నూలు(కలెక్టరేట్), అక్టోబరు 26: జిల్లాలోని అన్ని బ్యాంకులు సంయుక్తంగా మెగా రుణ మేళాను ఈ నెల 29న నిర్వహించనున్నాయి. జిల్లా లీడ్ బ్యాంకు ఆధ్వర్యంలో నగరంలోని రావూరి కన్వెన్షన హాల్లో రుణ మేళా నిర్వహిస్తామని లీడ్ డిస్ర్టిక్ట్ డివిజనల్ మేనేజర్ వెంకట నారాయణ మంగళవారం తెలిపారు. జిల్లాలోని అన్ని బ్యాంకులు స్టాల్స్ ఏర్పాటు చేస్తాయని, ప్రజలకు బ్యాంకులు అందే రుణ సదుపాయాలపై అవగాహన కల్పిస్తాయని తెలిపారు. రుణ మేళాలో లబ్ధిదారులకు గృహ, వాహన, విద్య, వ్యాపార, వ్యవసాయ రుణాలు, ప్రభుత్వ పథకాలైన ముద్ర, పీఎం స్వనిధి, స్టాండ్ అప్ ఇండియా, పీఎంఈజీపీ, పీఎంఎఫ్ఎంఈ, టిడ్కో హసింగ్ లోన్స తదితర రుణాలు ఇస్తామని తెలిపారు. ఈ కార్యక్రమాన్ని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని ఆయన సూచించారు.