25న మెగా జాబ్మేళా
ABN , First Publish Date - 2021-04-19T04:45:07+05:30 IST
ఉద్యోగ కల్పనే ధ్యేయంగా ఈనెల 25వ తేదీన జరగనున్న మెగా జాబ్ మే ళాను నిరుద్యోగ యువత సద్వి నియోగం చేసుకోవాలని ఎమ్మెల్యే అలజంగి జోగారావు అన్నారు.
పార్వతీపు రంటౌన్, ఏప్రిల్ 18: ఉద్యోగ కల్పనే ధ్యేయంగా ఈనెల 25వ తేదీన జరగనున్న మెగా జాబ్ మే ళాను నిరుద్యోగ యువత సద్వి నియోగం చేసుకోవాలని ఎమ్మెల్యే అలజంగి జోగారావు అన్నారు. ఆదివారం స్థానిక పార్టీ కార్యాలయంలో జామ్ మేళాకు సంబంధించిన పోస్ట ర్ను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నిరుద్యోగ యువ తకు ఉపాధి అవకాశాలను కల్పించాలన్నదే రాష్ట్ర ప్రభుత్వ లక్ష్యమన్నారు. అందుకే జాబ్ మేళాలను నిర్వ హించి యువతకు ఉపాధి అనే ఒక భరోసాను కల్పిం చాలని నిర్ణయించా మ న్నారు. పార్వతీపురం నియోజకవర్గమే కాకుండా కురుపాం, సాలూరు నియో జకవర్గాల యువత పాల్గొనాలని కోరారు. బైపాస్ రహదారిలోని సీ కన్వెషన్ హాల్లో జాబ్ మేళాకు ఉదయం 9 గంటల నుంచి హాజరు కావాలని కోరారు.