పౌర గ్రంథాలయాన్ని సందర్శించిన మేఘాలయ ఏడీజీపీ
ABN , First Publish Date - 2022-06-27T06:21:30+05:30 IST
ద్వారకానగర్లోని విశాఖ పౌర గ్రంథాలయాన్ని మేఘాలయ రాష్ట్ర అడిషనల్ డీజీపీ జి.హరిప్రసాద్, విశాఖ జాయింట్ కలెక్టర్ కేఎస్ విశ్వనాఽథన్లు ఆదివారం సందర్శించారు.
సీతమ్మధార, జూన్ 26 : ద్వారకానగర్లోని విశాఖ పౌర గ్రంథాలయాన్ని మేఘాలయ రాష్ట్ర అడిషనల్ డీజీపీ జి.హరిప్రసాద్, విశాఖ జాయింట్ కలెక్టర్ కేఎస్ విశ్వనాఽథన్లు ఆదివారం సందర్శించారు. ఈ సందర్భంగా గ్రంథాలయ కార్యదర్శి డీఎస్ వర్మ గ్రంథాలయంలోని ప్రతి విభాగాన్ని చూపించి వివరించారు. గ్రంఽథాలయంలో పోటీ పరీక్షలకు చదవుతున్న విద్యార్థులతో మాట్లాడుతూ వివరాలు ఆరా తీశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ వనరులను సక్రమంగా వినియోగించుకుని విజయం సాధించాలని ఆకాంక్షించారు. ఉద్యోగం వచ్చిన తర్వాత లేనివారికి సాయం చేయాలని సూచించారు. రోజులో ఎంతసేపు చదివామనేది ముఖ్యం కాదని, ఎంత విజ్ఞానాన్ని పొందామన్నదే ముఖ్యమన్నారు. అనంతరం విద్యార్థులు అడిగిన పలు ప్రశ్నలకు సమాధానాలు చెప్పారు.