ఇరువర్గాల కొట్లాట.. 8 మందికి గాయాలు

ABN , First Publish Date - 2021-04-21T05:09:01+05:30 IST

కోటబొమ్మాళి మండలం చిన్నసాన పంచాయతీ బుగతపేట గ్రామానికి చెందిన రెండు కుటుంబాల మధ్య మంగళవారం మధ్యాహ్నం జరిగిన భూ వివాదం కొట్లాటకు దారితీసింది.

ఇరువర్గాల కొట్లాట.. 8 మందికి గాయాలు
కోటబొమ్మాళి ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న క్షతగాత్రులు

టెక్కలి (కోటబొమ్మాళి), ఏప్రిల్‌ 20: కోటబొమ్మాళి మండలం చిన్నసాన పంచాయతీ బుగతపేట గ్రామానికి చెందిన రెండు కుటుంబాల మధ్య మంగళవారం మధ్యాహ్నం జరిగిన భూ వివాదం కొట్లాటకు దారితీసింది. ఈ సంఘటనలో ఇరువర్గాలకు చెందని 8 మందికి గా యాలయ్యాయి. ఈ సంఘటనలో ఒక వర్గానికి చెందిన అమ్మలయ్య ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఎండ అప్పన్న, బీమారావు,  లోకనాథం, అన్నపూర్ణలపై,  రెండో వర్గానికి చెందిన ఎండ అప్పన్న ఇచ్చిన ఫిర్యా దు మేరకు కవిటి అమ్మాయమ్మ, శ్రీరాములు, రామారావులపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ రవికుమార్‌ తెలిపారు. క్షతగాత్రులను స్థానిక సామా జిక ఆసుపత్రికి తరలించగా తీవ్రంగా గాయపడిన ఎండ అప్పన్న, ఎండ భీమారా వులను టెక్కలి ప్రభుత్వ ఆసుప్రతికి, మరో వర్గం నుంచి కవిటి అప్పమ్మ, రామా రావులను శ్రీకాకుళంకు మైరుగైన వైద్యం కోసం తరలించినట్లు ఎస్‌ఐ చెప్పారు.


 


Updated Date - 2021-04-21T05:09:01+05:30 IST