జిల్లా జడ్జిని కలిసిన బార్‌ అసోసియేషన్‌ సభ్యులు

ABN , First Publish Date - 2022-06-25T06:29:38+05:30 IST

నర్సీపట్నం బార్‌ అసోసియేషన్‌ కార్యవర్గ సభ్యులు జిల్లా ప్రధాన న్యాయమూర్తి హరహరనాథ్‌ శర్మను మర్యాదపూర్వకంగా శుక్రవారం విశాఖపట్నంలో కలిశారు.

జిల్లా జడ్జిని కలిసిన బార్‌ అసోసియేషన్‌ సభ్యులు
జిల్లా ప్రధాన న్యాయమూర్తిని కలిసిన బార్‌ అసోసియేషన్‌కార్యవర్గ సభ్యులు


గొలుగొండ/నర్సీపట్నం అర్బన్‌, జూన్‌ 24: నర్సీపట్నం బార్‌ అసోసియేషన్‌ కార్యవర్గ సభ్యులు జిల్లా ప్రధాన న్యాయమూర్తి హరహరనాథ్‌ శర్మను మర్యాదపూర్వకంగా శుక్రవారం విశాఖపట్నంలో కలిశారు. ఈ సందర్భంగా బార్‌ అసోసియేషన్‌ అధ్యక్ష, కార్యదర్శులు రావాడ సత్యనారాయణ, లోకా లోవరాజు నర్సీపట్నం కోర్టు పరిధిలోని సమస్యలను వివరించారు. ప్రధానంగా విద్యుత్‌ అంతరాయంతో కోర్టు కేసులు ఆన్‌లైన్‌ ప్రక్రియకు ఆటంకం కలుగుతుందన్నారు. అందువల్ల జనరేటర్‌ ఏర్పాటు చేయాలని కోరారు. కోర్టు ఆవరణలో ఎస్‌బీఐ, పోస్టాఫీసు శాఖలు ఏర్పాటు చేయాలని కోరారు. వివిధ కేసుల్లో పట్టుబడిన ఇసుక కోర్టు ఆవరణలో ఉందని, దీనిని వేలం వేసేందుకు అనుమతించాలని కోరారు. ఈ కార్యక్రమంలో బార్‌ అసోసియేషన్‌ సభ్యులు కృష్ణమోహన్‌, న్యాయవాదులు పైల శ్రీనివాస్‌, కోసూరు అప్పలనాయుడు తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2022-06-25T06:29:38+05:30 IST