నిర్మలా సీతారామన్ బడ్జెట్ ప్రసంగానికి అధికార పక్ష సభ్యుల హర్షధ్వానాలు

ABN , First Publish Date - 2022-02-01T16:57:37+05:30 IST

పార్లమెంటులో కేంద్రఆర్థికశాఖ మంత్రి నిర్మలా సీతారామన్ బడ్జెట్ ప్రసంగానికి అధికార బీజేపీ పక్ష ఎంపీల నుంచి హర్షధ్వానాలు వ్యక్తమయ్యాయి....

నిర్మలా సీతారామన్ బడ్జెట్ ప్రసంగానికి అధికార పక్ష సభ్యుల హర్షధ్వానాలు

న్యూఢిల్లీ : పార్లమెంటులో కేంద్రఆర్థికశాఖ మంత్రి నిర్మలా సీతారామన్ బడ్జెట్ ప్రసంగానికి అధికార బీజేపీ పక్ష ఎంపీల నుంచి హర్షధ్వానాలు వ్యక్తమయ్యాయి. ప్రధాన మంత్రి గతి శక్తి మిషన్, సమ్మిళిత అభివృద్ధి, ఉత్పాదకత పెంపు, ఆర్థిక పెట్టుబడులు- ఈ నాలుగు అంశాలపై ఈ బడ్జెట్ ప్రధానంగా దృష్టి సారిస్తుందని ఆర్థిక మంత్రి నిర్మల సీతారామన్ లోక్‌సభలో చెప్పినపుడు బీజేపీ సభ్యులు బల్లలు చరుస్తూ తమ హర్షధ్వానాలు వ్యక్తం చేశారు.  25,000 కిలోమీటర్ల మేరకు జాతీయ రహదారుల విస్తరణను లక్ష్యంగా పెట్టుకున్నట్లు మంత్రి నిర్మలా సీతారామన్ ప్రకటించగానే సభ్యులు చప్పట్లు చరిచారు. కొత్తగా 400  వందే భారత్ రైళ్ళను ప్రారంభిస్తామని మంత్రి చెప్పినపుడు కూడా సభ్యులు బల్లలు చరిచారు. నిర్మలా సీతారామన్ ప్రసంగానికి అధికార పక్ష సభ్యులు అడుగడుగునా బల్లలు చరిచారు.


Updated Date - 2022-02-01T16:57:37+05:30 IST