సభ్యత్వ నమోదులో ముందుండాలి
ABN , First Publish Date - 2021-02-28T05:43:52+05:30 IST
సభ్యత్వ నమోదులో ముందుండాలి
- మంత్రి చామకూర మల్లారెడ్డి
మేడ్చల్/దోమ: సభ్యత్వ నమోదులో ముందుండాలని రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి మల్లారెడ్డి మేడ్చల్ మున్సిపల్ టీఆర్ఎస్ నాయకులకు సూచించారు. పూర్తి చేసిన సభ్యత్వనమోదు పుస్తకాలను శనివారం మంత్రికి అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మేడ్చల్ మండలం జిల్లాలోనే నంబర్వన్ స్థానంలో ఉండేలా కృషిచేయాలన్నారు. మున్సిపల్ కోఆప్షన్ సభ్యుడు నవీన్రెడ్డి, నాయకులు సాటే నరేందర్, మాదవరెడ్డి పాల్గొన్నారు. వికారాబాద్ జిల్లా దోమ మండలం మోత్కూర్, తిమ్మాయిపల్లి గ్రామాల్లో శనివారం టీఆర్ఎస్ సభ్యత్వ నమోదును వైస్ఎంపీపీ మల్లేశం ఆధ్వర్యంలో చేపట్టారు.