సభ్యత్వ నమోదు లక్ష్యాన్ని అధిగమించాలి: మంత్రి
ABN , First Publish Date - 2021-03-01T04:06:02+05:30 IST
సభ్యత్వ నమోదు లక్ష్యాన్ని అధిగమించాలని మంత్రి శ్రీనివాస్ గౌడ్ అన్నారు.
మహబూబ్నగర్, ఫిబ్రవరి 28: సభ్యత్వ నమోదు లక్ష్యాన్ని అధిగమించాలని మంత్రి శ్రీనివాస్ గౌడ్ అన్నారు. ఆదివారం పట్టణంలోని 49వ వార్డులో నిర్వహించిన సభ్యత్వ నమోదు కార్యక్రమంలో మంత్రి పాల్గొన్నారు. ఈ సందర్బంగా పలువురు కార్యకర్తలకు సభ్యత్వాలు అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎంతో మంది స్వచ్ఛందంగా సభ్యత్వం చేసుకునేందుకు ముందుకు వస్తున్నారని తెలిపారు. కార్యక్రమంలో మునిసిపల్ చైర్మన్ కోరమోని నర్సింహులు నాయకులు కృష్ణమోహన్, గోపాల్యాదవ్, పటేల్ ప్రవీణ్, కోట్ల నర్సింహ, శాంత న్నయాదవ్, వెంకటేశ్గౌడ్ తదితరులు పాల్గొన్నారు.