పంచాయతీ కార్యదర్శులకు మెమో

ABN , First Publish Date - 2021-04-21T05:30:00+05:30 IST

పల్లె ప్రగతి పనుల్లో నిర్ల్యక్షం వహించిన రెండు గ్రామాల పంచాయతీ కార్యదర్శులకు ఎంపీడీవో సురేష్‌ మెమోలు జారీ చేశారు. బుధవారం ‘ఆంధ్రజ్యోతి’ మినీలో ప్రచురితమైన ‘అంతా మా ఇష్టం’ కథనానికి స్పందించారు.

పంచాయతీ కార్యదర్శులకు మెమో

‘ఆంధ్రజ్యోతి’ కథనానికి స్పందించిన అధికారులు

సిరికొండ, ఏప్రిల్‌ 21: పల్లె ప్రగతి పనుల్లో నిర్ల్యక్షం వహించిన రెండు గ్రామాల పంచాయతీ కార్యదర్శులకు ఎంపీడీవో సురేష్‌ మెమోలు జారీ చేశారు. బుధవారం ‘ఆంధ్రజ్యోతి’ మినీలో ప్రచురితమైన ‘అంతా మా ఇష్టం’ కథనానికి స్పందించారు. పంచాయతీ ట్రాక్టర్‌లతో సర్పంచ్‌లు తమ ఇష్టారాజ్యంగా ప్రైవేట్‌ పనులు చేయించుకోవడంపై విచారణ చేపట్టి మండలంలోని కొండాపూర్‌, పొన్న గ్రామపంచాయతీ కార్యదర్శులకు మెమోలు జారీ చేశారు. ఇప్పటికైనా తమ పనితీరును మెరుగుపర్చు కోవాలని లేకుంటే చర్యలు తప్పవని కార్యదర్శులను హెచ్చరించారు.

Updated Date - 2021-04-21T05:30:00+05:30 IST