బాల్క సురేష్‌ స్మారక క్రికెట్‌ పోటీలు ప్రారంభం

ABN , First Publish Date - 2022-01-18T04:25:51+05:30 IST

టీఆర్‌ఎస్‌వీ ఆధ్వర్యంలో బాల్క సురేష్‌ స్మారక క్రికెట్‌ పోటీలు రామకృష్ణాపూర్‌ ఠాగూర్‌ స్టేడియంలో సోమవారం ప్రారంభమ య్యాయి. ఏసీపీ ఎడ్ల మహేష్‌, మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ జంగం కళ పాల్గొన్నారు. జ్యోతి ప్రజ్వలన చేసి క్రీడాకారులను పరిచయం చేసుకొన్నారు.

బాల్క సురేష్‌ స్మారక క్రికెట్‌ పోటీలు ప్రారంభం
క్రీడాకారులను పరిచయం చేసుకుంటున్న ఏసీపీ ఎడ్ల మహేష్‌

మందమర్రి, జనవరి 17: టీఆర్‌ఎస్‌వీ ఆధ్వర్యంలో బాల్క సురేష్‌ స్మారక క్రికెట్‌ పోటీలు రామకృష్ణాపూర్‌ ఠాగూర్‌ స్టేడియంలో సోమవారం ప్రారంభమ య్యాయి. ఏసీపీ ఎడ్ల మహేష్‌, మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ జంగం కళ పాల్గొన్నారు.  జ్యోతి ప్రజ్వలన చేసి క్రీడాకారులను పరిచయం చేసుకొన్నారు. కరోనా కాలంలో క్రీడలను నిర్వహించడం కష్టంగా మారిందని, అందరూ మాస్కులు ధరించి, భౌతిక దూరాన్ని పాటించాలన్నారు. ఈ పోటీలు ఉమ్మడి ఆదిలాబాద్‌ జిల్లా స్థాయిలో జరుగుతున్నాయని, మొత్తం 40 టీమ్‌లు పాల్గొంటాయని, వారం రోజుల పాటు కొనసాగుతాయన్నారు. గ్రంథాలయ చైర్మన్‌ ప్రవీణ్‌, మున్సిపల్‌ వైస్‌ చైర్‌పర్సన్‌ విద్యాసాగర్‌ రెడ్డి, సీఐ ప్రమోద్‌, ఎస్‌ఐ సుధాకర్‌, కమిషనర్‌ వెంకటనారాయణ, టీఆర్‌ఎస్‌వీ నాయకులు ఆరుణ్‌ రిషి, గాండ్ల సమ్మయ్య, నర్సింగరావు,  సుదర్శన్‌ గౌడ్‌, కౌన్సిలర్లు తదితరులు పాల్గొన్నారు.


Updated Date - 2022-01-18T04:25:51+05:30 IST