క్రీడలతో మానసిక ఉల్లాసం
ABN , First Publish Date - 2021-01-16T06:03:04+05:30 IST
క్రీడలతో మానసిక ఉల్లాసం కలుగు తుందని జడ్పీ చైర్పర్సన్ న్యాలకొండ అరుణ రాఘవరెడ్డి, టీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు ఏనుగు మనోహర్రెడ్డి అన్నారు. మండలంలోని సుద్దాల లో ఫిట్ ఇండియా ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన మండల స్థాయి వాలీబాల్ క్రీడలను ప్రారంభించారు.
కోనరావుపేట, జనవరి 15: క్రీడలతో మానసిక ఉల్లాసం కలుగు తుందని జడ్పీ చైర్పర్సన్ న్యాలకొండ అరుణ రాఘవరెడ్డి, టీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు ఏనుగు మనోహర్రెడ్డి అన్నారు. మండలంలోని సుద్దాల లో ఫిట్ ఇండియా ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన మండల స్థాయి వాలీబాల్ క్రీడలను ప్రారంభించారు. ఎంపీపీ చంద్రయ్యగౌడ్, వైస్ ఎంపీపీ సుమలత, ఫ్యాక్స్ వైస్ చైర్మన్ మహేష్, సర్పంచ్ దేవలక్ష్మి తదితరులు పాల్గొన్నారు.
చందుర్తి: మండలంలోని మూడపల్లిలో యునైటెడ్ స్పోర్ట్ క్లబ్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న జిల్లా స్థాయి క్రికెట్ పోటీలను ఆరోరోజు శుక్రవారం వేములవాడ మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ ఏనుగు మనోహర్ రెడ్డి ప్రారంభించారు. అనంతరం మండలంలోని కిష్టం పేట, రామరావుపల్లి బాధిత కుటుంబాలను పరామర్శించారు. సర్పంచ్ చిలుక ఆంజిబాబు తదితరులు పాల్గొన్నారు.