అనుమతిలేని పాఠశాలలపై చర్యలు : ఎంఈవో
ABN , First Publish Date - 2020-11-27T06:07:51+05:30 IST
ప్రభుత్వ అనుమతులు లేకుండా ప్రైవేటు పాఠశాలలను నిర్వహిస్తే చర్యలు తీసుకుంటామని ఎంఈవో డి.రామారావు హెచ్చరించారు.
కైకలూరు : ప్రభుత్వ అనుమతులు లేకుండా ప్రైవేటు పాఠశాలలను నిర్వహిస్తే చర్యలు తీసుకుంటామని ఎంఈవో డి.రామారావు హెచ్చరించారు. ఆటపాకలోని శ్రీచైతన్య స్కూల్ను గురువారం అధికారులు పరిశీలించారు. స్కూల్కు ప్రభుత్వ గుర్తింపు లేనందున మూసివేస్తున్నామని, విద్యార్థుల తల్లిదండ్రులు దీనిని గమనించి వారి పిల్లలను ఆ పాఠశాలలో చేర్చవద్దన్నారు. ప్రధాన గేటు వద్ద నోటీసులను అంటించారు.