మెర్సిడెస్ సరికొత్త సీ-క్లాస్ సెడాన్ ప్రారంభ ధర రూ.55 లక్షలు
ABN , First Publish Date - 2022-05-13T06:41:26+05:30 IST
జర్మనీ లగ్జరీ కార్ల దిగ్గజం మెర్సిడెస్ బెంజ్.. భారత మార్కెట్లోకి సరికొత్త వెర్షన్ సీ-క్లాస్ సెడాన్ను విడుదల చేసింది.
హైదరాబాద్ : జర్మనీ లగ్జరీ కార్ల దిగ్గజం మెర్సిడెస్ బెంజ్.. భారత మార్కెట్లోకి సరికొత్త వెర్షన్ సీ-క్లాస్ సెడాన్ను విడుదల చేసింది. మూడు వేరియంట్లలో సీ-క్లాస్ సెడాన్ అందుబాటులో ఉండనుంది. 1.5 లీటర్ పెట్రోల్ ఇంజన్తో కూడిన సీ 200 ధర రూ.55 లక్షలుగా ఉండగా 2 లీటర్ డీజిల్ ఇంజన్తో కూడిన సీ 220డీ ధర రూ.56 లక్షలు, సీ 330 డీ ధర రూ.61 లక్షలు (ఎక్స్షోరూమ్)గా ఉన్నాయి. ఐదో తరం సీ-క్లాస్ కోసం ఇప్పటికే 1,000 పైగా ప్రీ బుకింగ్స్ వచ్చినట్లు మెర్సిడెస్ బెంజ్ తెలిపింది. ఈ ఏడాది భారత మార్కెట్లోకి కొత్తగా 10 మోడళ్లు విడుదల చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు కంపెనీ పేర్కొంది. ఇందులో భాగంగానే తొలుత మేబాక్ ఎస్-క్లా్సను తీసుకురాగా తాజాగా సీ-క్లాస్ సెడాన్ను తీసుకువచ్చినట్లు మెర్సిడెస్ వెల్లడించింది.