ధాన్యం డబ్బులతో వ్యాపారి పరార్

ABN , First Publish Date - 2022-01-13T20:59:59+05:30 IST

రైతులకు చెల్లించాల్సిన ధాన్యం డబ్బులతో ఓ వ్యాపారి

ధాన్యం డబ్బులతో వ్యాపారి పరార్

విజయవాడ: రైతులకు చెల్లించాల్సిన ధాన్యం డబ్బులతో ఓ వ్యాపారి పరార్ అయ్యాడు. ఏ.కొండూరు మండలం జిళ్లకుంట, మరేపల్లి  గ్రామాలాకి  చెందిన 35 మంది  రైతుల వద్ద నుంచి 10 నెలల క్రితం ధాన్యాన్ని ఖమ్మం జిల్లాకు చెందిన ధాన్యం వ్యాపారి సేకరించాడు. రైతుల వద్ద నుంచి  3 వేల బస్తాలు కొనుగోలు చేసి 40 లక్షల రూపాయలు మేర బాకీ పడ్డాడు. అనంతరం  రైతులకు డబ్బులు ఇవ్వకుండా వ్యాపారి తప్పించుకు తిరుగుతున్నాడు. నెలలు గడిచినా రైతుల ఖాతాలో నగదును జమ చేయలేదు. రైతులకు సమాధానం చెప్పలేక డబ్బులు ఇవ్వకుండా  వ్యాపారి మొహం చాటేసాడు. వ్యాపారి నుంచి తమకు రావలసిన బకాయిలను ఇప్పించాలని కోరుతూ ఏ.కొండూరు పోలీసు స్టేషన్‌లో వ్యాపారిపై రైతులు కేసు పెట్టారు. 

Updated Date - 2022-01-13T20:59:59+05:30 IST