‘ఉద్యమకారులకు న్యాయం కోసమే విలీనం’

ABN , First Publish Date - 2022-08-08T06:00:37+05:30 IST

తెలంగాణ రాష్ట్ర సాధన కోసం పోరాడిన ఉద్యమకారులకు న్యాయం జరిగేందుకే తెలంగాణ ఇంటి పార్టీని కాంగ్రె్‌సలో విలీ నం చేసి ఆ పార్టీలో చేరినట్లు డాక్టర్‌ చెరుకు సు ధాకర్‌ తెలిపారు.

‘ఉద్యమకారులకు న్యాయం కోసమే విలీనం’
సుధాకర్‌ను సన్మానిస్తున్న కాంగ్రెస్‌ నాయకులు

నకిరేకల్‌, ఆగస్టు 7: తెలంగాణ రాష్ట్ర సాధన కోసం పోరాడిన ఉద్యమకారులకు న్యాయం జరిగేందుకే తెలంగాణ ఇంటి పార్టీని కాంగ్రె్‌సలో విలీ నం చేసి ఆ పార్టీలో చేరినట్లు డాక్టర్‌ చెరుకు సు ధాకర్‌ తెలిపారు. నకిరేకల్‌లోని ఆయన తన నివాసంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మా ట్లాడారు. భవిష్యత్తులో తెలంగాణ ఉద్యమకారులకు న్యాయం జరిగేందుకు ప్ర త్యేకంగా కమిటీ ఏర్పాటు చేసి దానికి వ్యవస్థాపక అధ్యక్షుడిగా తనను నియమిస్తానని రేవంతరెడ్డి హామీ ఇవ్వడంతోనే కాంగ్రె్‌సలో చేరానని, ఎలాంటి స్వలాభం కోసం చేరలేదని పేర్కొన్నారు. భువనగిరి ఎంపీ కోమటిరెడ్డికి తనకు మధ్య ఎలాంటి విభేదాలు లేవని తెలిపారు. చెరుకు సుధాకర్‌ కాంగ్రెస్‌ పార్టీలో చేరినందుకు శాలిగౌరారం కాంగ్రెస్‌ పార్టీ మండల నాయకులు శాలువాలతో ఘనంగా సన్మానించారు. సమావేశంలో డీసీసీ ఉపాధ్యక్షుడు నూక సత్తయ్యయాదవ్‌, నా యకులు అన్నెబోయిన సుధాకర్‌, బండమీది రమేష్‌, నరేష్‌, విజయ్‌, మహేష్‌, ఎంపీటీసీ సైదమ్మ శ్రీనివాస్‌, భాస్కర్‌, రాందాసు, కిషోర్‌, సంపత పాల్గొన్నారు. 


Updated Date - 2022-08-08T06:00:37+05:30 IST