మెరుగైన వైద్యసేవలందించండి

ABN , First Publish Date - 2022-08-07T06:25:30+05:30 IST

మెరుగైన వైద్యసేవలందించండి

మెరుగైన వైద్యసేవలందించండి
సిబ్బందిని వివరాలు అడుగుతున్న డాక్టర్‌ గీతాబాయి

జిల్లా వైద్యారోగ్య శాఖ అధికారి డాక్టర్‌ గీతాబాయి  

పునాదిపాడు (కంకి పాడు), ఆగస్టు 6 : ప్రజలకు మెరుగైన వైద్య సేవలందిం చాలని జిల్లా వైద్యారోగ్య శాఖ అధికారి డాక్టర్‌ గీతాబాయి సంబంధిత అధికారులను ఆదే శించారు. మండలంలోని ఉప్ప లూరు ప్రాథమిక ఆరోగ్య కేంద్రంతో పాటు పునాదిపాడులోని ఆరోగ్య ఉపకేంద్రాన్ని శనివారం ఆమె ఆకస్మికంగా తనిఖీ చేశారు. తల్లి బిడ్డ సంరక్షణకు సంబంధించిన రిజిస్టర్‌ను పరిశీలించారు. గ్రామాల్లో ప్రజలకు అందచేస్తున్న సంక్షేమ పథకాల వివరాలను అడిగి తెలుసుకున్నారు.  ఈ కార్యక్రమంలో ఉప్పలూరు ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వైద్యాధికారి సుందర్‌, సూపర్‌వైజర్‌ శ్యామ్‌,  పంచాయతీ కార్యదర్శి వెంకటేశ్వరరావు, వీఆర్వో మల్లికార్జునరావు, సచివాలయ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. 

Updated Date - 2022-08-07T06:25:30+05:30 IST