ఢిల్లీలో అక్కడ మాత్రమే మెట్రో సేవలు అందుబాటులో ఉంటాయి: డీఎంఆర్సీ
ABN , First Publish Date - 2020-11-27T01:03:09+05:30 IST
ఢిల్లీలో అక్కడ మాత్రమే మెట్రో సేవలు అందుబాటులో ఉంటాయి: డీఎంఆర్సీ
న్యూఢిల్లీ: శుక్రవారం రోజు ఢిల్లీ నుంచి ఎన్సీఆర్ విభాగాల వైపు మాత్రమే మెట్రో సర్వీసులు అందుబాటులో ఉంటాయని ఢిల్లీ మెట్రో రైల్ కార్పొరేషన్ (డీఎంఆర్సీ) గురువారం తెలిపింది.
అయితే తదుపరి నోటీసు వచ్చేవరకు భద్రతా కారణాల దృష్ట్యా ఎన్సీఆర్ స్టేషన్ల నుంచి ఢిల్లీ వైపు సేవలు అందుబాటులో ఉండవని డీఎంఆర్సీ పేర్కొంది. రైతుల నిరసనల మధ్య ఢిల్లీ పోలీసుల సలహా మేరకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు డీఎంఆర్సీ స్పష్టం చేసింది.