కొత్త ఫీచర్లతో ఎంఐ 11 ఎక్స్ ప్రో స్మార్ట్ఫోన్..
ABN , First Publish Date - 2021-04-26T02:49:55+05:30 IST
కొత్త ఫీచర్లతో ఎంఐ 11 ఎక్స్ ప్రో స్మార్ట్ఫోన్..
న్యూఢిల్లీ: చైనాకు చెందిన ప్రముఖ స్మార్ట్ఫోన్ల తయారీ సంస్థ షియోమి తమ వినియోగదారులకు శుభవార్త అందించింది. అద్భుత ఫీచర్లతో కొత్త స్మార్ట్ఫోన్లను అందుబాటులోకి తీసుకొచ్చినట్లు సంస్థ పేర్కొంది. భారతదేశంలో ఎంఐ 11 ఎక్స్ ప్రో స్మార్ట్ఫోన్ల ప్రీ-ఆర్డర్స్ ఈ రోజు నుంచి ప్రారంభమయ్యాయని కంపెనీ పేర్కొంది. ఎంఐ 11 ఎక్స్ ప్రో స్మార్ట్ఫోన్ హెచ్జెడ్ ఈ4 అమోలెడ్ డిస్ప్లేను కలిగి ఉందని షియోమి తెలిపింది. ఈ ఫోన్ స్నాప్డ్రాగన్ 888 ఎస్వోసీతో పనిచేస్తోందని సంస్థ వెల్లడించింది. అమెజాన్లో ఎంఐ 11 ఎక్స్ ప్రో ఫోన్ మే 3 నుంచి విక్రయించబడుతోందని పేర్కొంది. ఎంఐ 11 ఎక్స్ ప్రో ఫోన్కు 4,520 ఎంఏహెచ్ బ్యాటరీతోపాటు 33డబ్ల్యూ ఫాస్ట్ ఛార్జింగ్ ఉంటుంది. ఈ ఫోన్లో 20 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరా ఉంది. 8జీబీ ర్యామ్, 128జీబీ స్టోరేజ్ వేరియంట్ ఎంఐ 11 ఎక్స్ ప్రో స్మార్ట్ఫోన్ రూ. 39,990 ఉంటుందని సంస్థ తెలిపింది. 8జీబీ ర్యామ్, 256జీబీ స్టోరేజ్ వేరియంట్ ఎంఐ 11 ఎక్స్ ప్రో స్మార్ట్ఫోన్ రూ. 41,999 ఉంటుందని షియోమి సంస్థ పేర్కొంది.