సమస్యలు పరిష్కరించాలి
ABN , First Publish Date - 2021-11-28T05:27:52+05:30 IST
మధ్యాహ్న భోజన వర్కర్ల సమస్యలు పరిష్కరించాలని కార్మికులు డిమాండ్ చేశారు.
మధ్యాహ్న భోజన వర్కర్ల ధర్నా
చింతలపూడి, నవంబరు 27: మధ్యాహ్న భోజన వర్కర్ల సమస్యలు పరిష్కరించాలని కార్మికులు డిమాండ్ చేశారు. ఎంఈవో కార్యాలయం వద్ద శనివారం ధర్నా నిర్వహించారు. ఇరవై ఏళ్లుగా ఈ పథకాన్ని సమర్థవం తంగా నిర్వహిస్తున్నప్పటికీ సమస్యలు పరిష్కారం కావడంలేదని ఏఐటీ యూసీ నాయకులు పేర్కొన్నారు. నూనె, కూరగాయల ధరలు పెరిగాయని, బిల్లులు నాలుగు నెలలుగా రాకపోవడం వల్ల వడ్డీలకు తెచ్చి భోజనం వడ్డిస్తున్నామని సమస్యలు పరిష్కరించాలని కోరుతున్నప్పటికీ పట్టించుకోక పోవడంపై ఆవేదన వ్యక్తం చేశారు. ఒక్కొక్క విద్యార్థికి రూ. 15 కేటాయిం చాలని, బకాయిలు చెల్లించాలని, పది వేల రూపాయల జీతం ఇవ్వాలని, గ్యాస్ ఉచితంగా సరఫరా చేయాలని కోరారు. ధర్నాలో ఏఐటీయూసీ ఏరి యా కార్యదర్శి బుచ్చిబాబు, తుర్లపాటి బాబు, యూనియన్ నాయకురాలు షేక్ పకీర్, అమ్మ రాజేశ్వరి, సుజాత తదితరులు పాల్గొన్నారు.