మధ్యాహ్న భోజనం నాణ్యతపై తనిఖీలు

ABN , First Publish Date - 2020-12-03T04:37:16+05:30 IST

జిల్లాలోని ప్రభుత్వ పా ఠశాలల్లో అమలవుతున్న మధ్యా హ్న భోజన పథకం ఆహార పదా ర్థాల నాణ్యతను పాఠశాల విద్య (ఎండీఎం, స్కూల్‌ శానిటేషన్‌) రాష్ట్ర డైరెక్టర్‌ దివాన్‌ మై దీన్‌ బుధవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు.

మధ్యాహ్న భోజనం నాణ్యతపై తనిఖీలు
విద్యార్థులకు పౌష్టికాహార పంపిణీని పరిశీలిస్తున్న పాఠశాల విద్య (ఎండీఎం, స్కూల్‌ శానిటేషన్‌) రాష్ట్ర డైరెక్టర్‌ దివాన్‌ మై దీన్‌

ఏలూరు ఎడ్యుకేషన్‌, డిసెం బరు 2 : జిల్లాలోని ప్రభుత్వ పా ఠశాలల్లో అమలవుతున్న మధ్యా హ్న భోజన పథకం ఆహార పదా ర్థాల నాణ్యతను పాఠశాల విద్య (ఎండీఎం, స్కూల్‌ శానిటేషన్‌) రాష్ట్ర డైరెక్టర్‌ దివాన్‌ మై దీన్‌ బుధవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. అప్పనవీడు, కలపర్రు, గోపన్నపాలెం, కొవ్వ లిలలోని హైస్కూళ్లను సందర్శించి భోజనపఽథకం అమలుతీరు, డ్రైరేషన్‌ సరుకుల పంపిణీని పరిశీలించారని డీఈవో సీవీ రేణుక తెలిపారు. పాఠశాలల్లోని టాయి లెట్లను పరిశీలించారని, విద్యార్థులతో మాట్లాడి ఆహారపదార్థాల నాణ్యత గురించి తెలుసుకున్నారన్నారు. బాలిబాలికలతో కలిసి భోజనం చేశారు. నాడు – నేడు నిర్మా ణ పనుల ప్రగతిని పరిశీలించారు. డైరెక్టర్‌ వెంట మధ్యాహ్న భోజన పథకం అసి స్టెంట్‌ డైరెక్టర్‌ వరదాచార్యులు, ఎంఈవో నరసింహమూర్తి, సూపరింటెండెంట్‌ మోహన్‌, పాఠశాల హెచ్‌ఎంలు, టీచర్లు ఉన్నారు.

Updated Date - 2020-12-03T04:37:16+05:30 IST