మధ్యాహ్న భోజనం తనిఖీ

ABN , First Publish Date - 2021-10-27T03:06:03+05:30 IST

చిట్టమూరులోని జీఎం నాయుడు ఉన్నత పాఠశాలను మంగళవారం అకడమిక్‌ మానటరింగ్‌ అధికారి నాగమోహన్‌రెడ్డి అక

మధ్యాహ్న భోజనం తనిఖీ
చిట్టమూరు హైస్కూల్‌లో మధ్యహ్న భోజనాన్ని తనిఖీ చేస్తున్న ఏఎంవో నాగమోహన్‌ రెడ్డి

చిట్టమూరు, అక్టోబర్‌ 26 : చిట్టమూరులోని జీఎం నాయుడు ఉన్నత పాఠశాలను మంగళవారం అకడమిక్‌ మానటరింగ్‌ అధికారి నాగమోహన్‌రెడ్డి అకస్మికంగా సంద ర్శించారు. విద్యార్ధులకు మఽధ్యాహ్నం భోజనం వడ్డించే సమయంలో వచ్చిన ఆయన భోజన పదార్థాలను తనిఖీ చేశారు. అనంతరం ఎంఈవో బీవీ కృష్ణయ్య, హెచ్‌ఎం పద్మావతిలతో కలసి ఉపాధ్యాయులతో, సీఆర్‌పీలతో  వేర్వేరుగా సమావేశం నిర్వహించారు. నిషిత యాప్‌ను డౌన్‌లోడ్‌ చేసుకొని శిక్షణను పూర్తి చేయాలన్నారు. శిక్షణలో అంగన్‌వాడీలను భాగస్వాములను చేయాలని తెలిపారు.


Updated Date - 2021-10-27T03:06:03+05:30 IST