ఇసుకతెప్ప పడడంతో కూలీ మృతి

ABN , First Publish Date - 2021-02-28T04:50:06+05:30 IST

ఇసుకతెప్ప పడడంతో కూలీ మృతి

ఇసుకతెప్ప పడడంతో కూలీ మృతి

కమలాపూర్‌, ఫిబ్రవరి 27 : మండలంలోని శనిగరం గ్రామ వాగుపై నిర్మిస్తున్న బ్రి డ్జి వద్ద పనులు జరిగే స్థలంలో శనివారం ఇసుక తెప్ప కూలిపడడంతో అక్కడే పనిచేస్తున్న వలస కూలీ మృతి చెందాడు. ఎస్సై పరమేశ్వర్‌ వివరాల మేరకు.. మధ్యప్రదేశ్‌ రాష్ర్టానికి చెందిన దీపక్‌ అగారియా (21) కొద్ది రోజులుగా శనిగరం బ్రిడ్జి నిర్మాణ ప నులకు కూలీగా వస్తున్నాడు. వాగులో పిల్లర్‌ నిర్మించేందుకు తవ్విన గుంతలో అగారి యా  పనిచేస్తుండగా పైనుంచి ఇసుక తెప్పకూలి పడింది. ఈ ప్రమాదంలో అగారి యా నీటిలో మునిగిపోయాడు. తోటి కార్మికులు అతడిని బయటకు తీసి ఎంజీఎం ఆ స్పత్రికి తరలించగా అప్పటికే చనిపోయినట్లు నిర్ధారించారు. జార్ఖండ్‌కు చెందిన మేస్ర్తీ ముస్తాఫా అన్సారీ ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు. సరైన భద్రతా చర్యలు పాటించకపోవడంతోనే మృతిచెందాడని గ్రామస్థులు ఆరోపించారు. 


Updated Date - 2021-02-28T04:50:06+05:30 IST