ఆ ఇద్దరు పిల్లలకు విద్యానికేతన్లో ఉచిత విద్య : మోహన్ బాబు
ABN , First Publish Date - 2021-07-25T12:20:36+05:30 IST
ఇద్దరు పిల్లలకు శ్రీవిద్యా నికేతన్ విద్యాసంస్థల్లో ఉచితంగా విద్య అందించేందుకు...
చిత్తూరు జిల్లా/చంద్రగిరి : ఐరాల మండలం రెడ్డివారి పల్లెకు చెందిన సీహెచ్ ప్రవీణ్ కుమార్ ఉగ్రదాడిలో మృతి చెందిన విషయం తెలిసిందే. ఆయన ఇద్దరు పిల్లలకు శ్రీవిద్యా నికేతన్ విద్యాసంస్థల్లో ఉచితంగా విద్య అందించేందుకు చైర్మన్ మోహన్ బాబు నిర్ణయించారు. ఈ సమాచారం తెలుసుకున్న 18వ రెజిమెంట్ (మద్రాసు) అధికారి కల్నల్ నరేష్ సంతోషం వ్యక్తం చేశారు. అలాగే విశ్రాంత సైనికాధికారులు బండి పరమేశ్వరరెడ్డి, తిలక్ యాదవ్, రమేష్ శనివారం మోహన్బాబుకు జ్ఞాపికను అందజేసి అభినందించారు. దేశం కోసం ప్రాణాలర్పించిన సైనికుడి కుటుంబానికి అండగా నిలవడం దేవుడు తమకు ఇచ్చిన అవకాశంగా భావిస్తున్నామని శ్రీవిద్యానికేతన్ విద్యాసంస్థల సీఈవో మంచు విష్ణు ఈ సందర్భంగా పేర్కొన్నారు.