రేపటి నుంచి సైనిక నియామక ర్యాలీ
ABN , First Publish Date - 2020-12-03T11:50:03+05:30 IST
సైనిక నియామక ర్యాలీని సికింద్రాబాద్లో ఈనెల 4 నుంచి ఫిబ్రవరి 28 వరకు నిర్వహిస్తున్నట్లు రక్షణ శాఖ ఒక ప్రకటనలో తెలిపింది...
హైదరాబాద్: సైనిక నియామక ర్యాలీని సికింద్రాబాద్లో ఈనెల 4 నుంచి ఫిబ్రవరి 28 వరకు నిర్వహిస్తున్నట్లు రక్షణ శాఖ ఒక ప్రకటనలో తెలిపింది. యూనిట్ హెడ్క్వార్టర్స్ కోటాలో ఏవియేషన్ టెక్నీషియన్, జనరల్ డ్యూటీ జవాన్, ట్రేడ్స్మన్, చెఫ్, స్టీవార్డ్ పోస్టులను భర్తీ చేయనున్నట్లు పేర్కొంది. స్పోర్ట్స్ కోటాలోనూ ఎంపిక చేస్తామని వివరించింది. ఎక్స్సర్వీస్ మెన్, విడో కుమారులు ఈ పోస్టులకు అర్హులని స్పష్టం చేసింది. అర్హత గల అభ్యర్థులు ఈనెల 4న ఉదయం సికింద్రాబాద్లోని 4 ట్రైనింగ్ బెటాలియన్, కోటేశ్వర్ మందిర్ వద్ద రిపోర్టు చేయాలని తెలిపింది.