పోలీసుల ఎదుట మిలీషియా సభ్యుడి లొంగుబాటు
ABN , First Publish Date - 2021-04-24T04:20:28+05:30 IST
సీపీఐ మావోయిస్టు గాలికొండ ఏరియా కమిటీ పరిధిలో పనిచేస్తున్న మిలీషియా సభ్యుడు పాంగి శ్రీరామ్ స్వచ్ఛందంగా లొంగిపోయాడని జీకేవీధి సీఐ మురళీధర్ తెలిపారు.
గూడెంకొత్తవీధి, ఏప్రిల్ 23: సీపీఐ మావోయిస్టు గాలికొండ ఏరియా కమిటీ పరిధిలో పనిచేస్తున్న మిలీషియా సభ్యుడు పాంగి శ్రీరామ్ స్వచ్ఛందంగా లొంగిపోయాడని జీకేవీధి సీఐ మురళీధర్ తెలిపారు. శుక్రవారం ఆయన విలేఖర్లతో మాట్లాడుతూ జీకేవీధి పంచాయతీ, గుండ్లపనస గ్రామానికి చెందిన పాంగి శ్రీరామ్ (26) కొంతకాలంగా మిలీషియా సభ్యుడుగా పనిచేస్తున్నాడన్నారు. పోలీసులు ఇచ్చిన పిలుపు మేరకు స్వచ్ఛందంగా లొంగిపోయాడన్నారు. మావోయిస్టు పార్టీలో మిలీషియా, దళసభ్యులు స్వచ్ఛందంగా లొంగిపోతే కేసులు రద్దుచేసి, పునరావాసం కల్పిస్తామన్నారు. ఈ కార్యక్రమంలో ఎస్ఐ అనీష్ పాల్గొన్నారు.