పాల కంటైనర్ బోల్తా
ABN , First Publish Date - 2021-06-23T06:05:11+05:30 IST
మండలపరిధిలోని సంజీవపురం వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒకరు మృతిచెందగా ఇద్దరికి స్వల్పగాయాలయైున ఘటన చోటు చేసుకుంది.
డ్రైవర్ మృతి
బత్తలపల్లి, జూన22: మండలపరిధిలోని సంజీవపురం వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒకరు మృతిచెందగా ఇద్దరికి స్వల్పగాయాలయైున ఘటన చోటు చేసుకుంది. స్థానికులు, పోలీసులు తెలిపిన వివరాల మేరకు తమిళనాడు నుంచి అనంతపురం వెళ్తున్న పాల కంటైనర్ మంగళవారం సంజీవపురం వద ్దకు రాగానే ద్విచక్రవాహనంలో వెళ్లుతున్న సచివాలయ ఉద్యోగులను సోకడంతో అదుపుతప్పి కిందపడ్డారు. దీంతో కంటైనర్ కూడా ముందుకు దూసుకువెళ్లి సచివాలయం ముందర బోల్తాపడింది. ఈ ప్రమాదంలో కంటైనర్ డ్రైవర్ తమి ళనాడుకు చెందిన నట్టేష్(45) అక్కడిక్కడే దుర్మరణం చెందాడు. ఈ ప్రమా దంలో సచివాలయ ఉద్యోగులు లిఖిత, సత్యనారాయణలు స్వల్పంగా గాయ పడ్డారు. ప్రమాదంలో కంటైనర్ రోడ్డుకు అడ్డంగా పడటంతో ప్రధాన రహదారి కావడంతో ఎక్కడివాహనాలు అక్కడే నిలిచిపోయాయి. ఈ విషయం తెలుసు కున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని ట్రాఫిక్ను పునరుద్ధరించి కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.