TS News: బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్పై ఎంఐఎం ఆగ్రహం..
ABN , First Publish Date - 2022-08-23T16:30:52+05:30 IST
బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారంటూ ఎఐఎం నేతలు, కార్యకర్తలు ఆందోళన చేపట్టారు.
హైదరాబాద్ (Hyderabad): బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ (Raja Singh) వివాదాస్పద వ్యాఖ్యలు (Controversial comments) చేశారంటూ హైదరాబాద్లోని సోమవారం రాత్రి నుంచి ఎంఐఎం (MIM) నేతలు, కార్యకర్తలు ఆందోళనకు దిగారు. ఆయనపై చర్యలు తీసుకోవాలని నిరసన చేపట్టారు. ఆయన సోషల్ మీడియాలో చేసిన వ్యాఖ్యలను తొలగించాలని డిమాండ్ చేశారు. దీంతో డబీర్పురా పోలీస్ స్టేషన్లో రాజాసింగ్పై కేసు నమోదైంది.
కాగా హైదరాబాద్ పోలీసుల విజ్ఞప్తి మేరకు ఎమ్మెల్యే రాజాసింగ్ వివాదాస్పద వీడియోను(video) యూట్యూబ్(YouTube) నుంచి తొలగించారు.(removed) రాముడిని కించపర్చిన మునావర్ ఫారుఖీని హైదరాబాద్ తీసుకొస్తే...తీవ్ర పరిణామాలు ఉంటాయని రాజాసింగ్ హెచ్చరించారు. ‘‘నేను హెచ్చరించినా మునావర్తో షో జరిపించారు, పోలీసులకు నేను ముందే దండం పెట్టి వేడుకున్నా, అయినా వినలేదు, మునావర్కు కౌంటర్ వీడియోలు చేస్తానని ముందే చెప్పాను’’ అని రాజాసింగ్ పేర్కొన్నారు. రాజాసింగ్ అలా చేసిన వీడియోను యూట్యూబ్లో పెట్టడంతో వివాదం చెలరేగింది.