మినీ స్టేడియం నిర్మాణానికి గ్రహణం!

ABN , First Publish Date - 2021-12-26T03:10:46+05:30 IST

ఉదయగిరిలో మినీ స్టేడియం నిర్మాణానికి గత టీడీపీ ప్రభుత్వ హయాంలో రూ.1.40 కోట్లు మంజూరయ్యాయి.

మినీ స్టేడియం నిర్మాణానికి గ్రహణం!
అర్ధాంతరంగా పనులు నిలిచిన మినీ స్టేడియం

టీడీపీ హయాంలో ప్రారంభం

మూడేళ్లుగా ఆగిన పనులు

క్రీడాభిమానుల్లో అసంతృప్తి

ఉదయగిరి డిసెంబరు 25: ఉదయగిరిలో మినీ స్టేడియం నిర్మాణానికి గత టీడీపీ ప్రభుత్వ హయాంలో రూ.1.40 కోట్లు మంజూరయ్యాయి. ఆ నిధులతో మూడేళ్ల క్రితం పనులు ప్రారంభించారు. ఆతర్వాత వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక పనులకు గ్రహణం పట్టింది. ప్రస్తుతం ఆ ప్రదేశంలో చిల్లచెట్లు మెలచి శ్మశానాన్ని తలపిస్తోంది. నియోజకవర్గాన్ని అభివృద్ధి చేస్తామని గొప్పలు చెప్పుకుంటున్న ప్రజాప్రతినిధులు దీని వైపు కన్నెత్తి చూడకపోవడంపై క్రీడాభిమానులు, ప్రజల్లో అసంతృప్తి వ్యక్తమవుతుంది. టీడీపీ హయాంలో అప్పటి ఎమ్యెల్యే బొల్లినేని రామారావు కృషితో మంజూరైన మినీ స్టేడియం నిర్మాణానికి రూ.1.40 కోట్ల మంజూరుకాగా చేపట్టిన పనులకు రెండు విడతల్లో రూ.44 లక్షలు బిల్లులు అందాయి. వైసీపీ ప్రభుత్వంలో నిధులు విడుదలకాకపోవడంతో పనులకు గ్రహణం పట్టింది. బిల్లులు రావన్న ఉద్ధేశ్యంతో కాంట్రాక్టర్లు పనులు చేయకుండా చేతులెత్తేశారు. ఇప్పటికైనా ప్రజాప్రతినిధులు, అధికారులు స్పందించి మినీ స్టేడియం నిర్మాణాన్ని పూర్తి చేయించే దిశగా చర్యలు చేపట్టాలని క్రీడాభిమానులు, ప్రజలు కోరుతున్నారు. 


Updated Date - 2021-12-26T03:10:46+05:30 IST