మినీ వ్యాన్ ఢీకొని విద్యార్థి మృతి
ABN , First Publish Date - 2022-05-26T06:44:09+05:30 IST
రాజవొమ్మంగి మండలంలో బుధవారం ఓ మినీ వ్యాన్ బైక్ను ఢీకొట్టడంతో విద్యార్థి మృతి చెందాడు. జడ్డంగి ఎస్ఐ షరీఫ్ తెలిపిన వివరాల ప్రకారం..
రాజవొమ్మంగి మే 25: రాజవొమ్మంగి మండలంలో బుధవారం ఓ మినీ వ్యాన్ బైక్ను ఢీకొట్టడంతో విద్యార్థి మృతి చెందాడు. జడ్డంగి ఎస్ఐ షరీఫ్ తెలిపిన వివరాల ప్రకారం.. రాజవొమ్మంగి కమ్మరపేటకు చెందిన కలింకోట నవీన్ ఇంటర్ పరీక్ష రాసేందుకు అడ్డతీగల వెళుతూ తన స్నేహితుడైన మిరియాల గౌతమ్ కుమార్(15)ను కూడా తనతో బైక్పై తోడు తీసుకెళ్లాడు. పరీక్ష రాసిన అనంతరం తిరిగి వస్తుండగా జడ్డంగి సమీపంలో వెంకటేశ్వర స్వామి ఆలయం వద్ద ఎదురుగా వస్తున్న 407 వాహనం అతివేగంతో వచ్చి న వీన్ నడుపుతున్న బైక్ను ఢీకొట్టింది. దీంతో బైక్ వెనుక కూర్చున్న గౌతమ్ కుమార్ తలకు, చేతులకు బలమైన గాయం కావడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. బైక్ నడుపుతున్న నవీన్కు తీవ్రగాయాలు కావడంతో స్థానికులు జడ్డంగి ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. జడ్డంగి ఎస్ఐ షరీఫ్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. గౌతమ్కుమార్ ఇటీవల పదో తరగతి పరీక్షలు రాశాడు. అతని తండ్రి మరణించగా తల్లి అప్పలరాజు వలంటీర్గా పనిచేస్తున్నారు. గౌతమ్కు సోదరి ఉంది.