మూడిళ్లూ ప్రారంభం కాలేదా?
ABN , First Publish Date - 2022-05-19T04:49:45+05:30 IST
300 ఇళ్లు మంజూరైతే మూడిళ్లను కూడా ప్రారంభించలేదా అని కలెక్టర్ చక్రధర్బాబు అధికారులను ప్రశ్నించి అసంతృప్తి వ్యక్తం చేశారు
అధికారులను ప్రశ్నించిన కలెక్టర్ చక్రధర్బాబు
బుచ్చిరెడ్డిపాళెం,మే18 : 300 ఇళ్లు మంజూరైతే మూడిళ్లను కూడా ప్రారంభించలేదా అని కలెక్టర్ చక్రధర్బాబు అధికారులను ప్రశ్నించి అసంతృప్తి వ్యక్తం చేశారు. బుధవారం ఆయన మండలంలోని రామచంద్రాపురం, జొన్నవాడ గ్రామాల్లోని జగనన్న కాలనీలను పరిశీలించారు. తొలుత జొన్నవాడలో పర్యటించి త్వరితగతిన ఇళ్ల నిర్మాణాలు పూర్తి చేయాలన్నారు. ఈసందర్భంగా పలువురు లబ్ధిదారులు నీరు, విద్యుత్ సమస్యలను తెలుపడంతో వెంటనే పరిష్కరిస్తామన్నారు. అనంతరం రామచంద్రాపురంలో ఓ దివ్యాంగుడు మూడు చక్రాల బండితో ఇబ్బందులు పడుతున్నానని, మోటార్ వాహనం ఇప్పించాలని కోరారు. స్పందించిన కలెక్టర్ రెండు రోజుల్లో మోటార్ వెహికల్ ఇప్పించాలని సీసీని ఆదేశించారు. కార్యక్రమంలో కలెక్టర్ వెంట హౌసింగ్ పీడీ నరసింహ, మండల ప్రత్యేకాధికారి ఉషారాణి, పబ్లిక్ హెల్త్ ఎస్ఈ జానీ, తహసీల్దారు, ఎంపీడీవో, ఈఈ దయాకర్, పంచాయతీ కార్యదర్శి చలపతి, ఇంజనీరింగ్ అసిస్టెంట్లు పాల్గొన్నారు.