మహానాడు పేరిట మాయనాడు: మంత్రి Suresh

ABN , First Publish Date - 2022-05-28T19:52:37+05:30 IST

తెలుగుదేశం పార్టీ మహానాడు సదస్సు పెట్టి వైసీపీ పైన లేనిపోని ఆరోపణలు చేస్తోందని మంత్రి ఆదిమూలపు సురేష్ ఆగ్రహం వ్యక్తం చేశారు.

మహానాడు పేరిట మాయనాడు: మంత్రి Suresh

విజయవాడ: తెలుగుదేశం పార్టీ మహానాడు సదస్సు పెట్టి వైసీపీ పైన లేనిపోని ఆరోపణలు చేస్తోందని మంత్రి ఆదిమూలపు సురేష్ (Adimulapu suresh) ఆగ్రహం వ్యక్తం చేశారు. శనివారం మీడియాతో మాట్లాడుతూ... బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలను సామాజికంగా రాజకీయంగా ఆర్థికంగా ప్రభుత్వం ఆదుకుంటోందని తెలిపారు. ఈ అంశాన్ని ప్రజల్లోకి సామాజిక న్యాయం పేరిట బస్సు యాత్ర చేపట్టామని వివరించారు. మహానాడు పేరిట మాయనాడు పెట్టి చంద్రబాబు(Chandrababu) లేనిపోని ఆరోపణలు చేస్తున్నారని అన్నారు. స్వతంత్ర భారతావనిలో ఎవరు ఇవ్వని విధంగా బీసీ, ఎస్సీ, ఎస్టీలకు వైసీపీ ప్రభుత్వం పదవులు ఇచ్చిందని తెలిపారు. సామాజిక న్యాయం అంటే స్థితిగతులు బాగుపడడమే అని చెప్పుకొచ్చారు. పార్టీ, ప్రాంతం, కులం చూడకుండా జగన్ అందరివాడుగా మారారన్నారు. మూడేళ్ల పాలన చూసిన తర్వాత ప్రజలంతా జగన్‌కు అండగా ఉండాలని తాము కోరుతున్నామని మంత్రి ఆదిమూలపు సురేష్ పేర్కొన్నారు. 

Updated Date - 2022-05-28T19:52:37+05:30 IST