రాబోయే ఎన్నికల్లోనూ టీడీపీకి ఇదే పరిస్థితి: మంత్రి సురేష్

ABN , First Publish Date - 2021-11-17T22:16:35+05:30 IST

రాష్ట్రంలో రాబోయే రోజుల్లో ఏ ఎన్నిక జరిగినా టీడీపీకి దారుణ

రాబోయే ఎన్నికల్లోనూ టీడీపీకి ఇదే పరిస్థితి: మంత్రి సురేష్

అమరావతి: రాష్ట్రంలో రాబోయే రోజుల్లో ఏ ఎన్నిక జరిగినా టీడీపీకి దారుణ పరాభవం తప్పదని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ అన్నారు. స్థానిక సంస్థల ఎన్నికలలో వైసీపీ ఘన విజయం సాధించడం, టీడీపీ అధినేత చంద్రబాబు కంచుకోట కుప్పం మున్సిపల్ ఎన్నికలలో టీడీపీ దారణంగా ఓటమి చెందడంతో ఎన్నికల ఫలితాలపై మంత్రి స్పందించారు. కుప్పం మా అడ్డా అని గొంతు చించుకున్న బాబూ, కొడుకు ఇప్పుడేమంటారని ఆయన ప్రశ్నించారు. దొంగ ఓట్లు అన్నారు, కౌంటింగ్ రికార్డు చేయాలన్నారన్నారు. అధికారులకు ఫిర్యాదులు చేస్తూ గగ్గోలు పెట్టారన్నారు. ఇన్ని చేసినా ప్రజా తీర్పును మార్చలేరుగా అని ఆయన పేర్కొన్నారు.


రాష్ట్ర ప్రజల విశ్వాసాన్ని చంద్రబాబు ఎప్పుడో కోల్పోయారని ఆయన ఎద్దేవా చేశారు. ఇప్పుడు స్థానిక మున్సిపల్ ఎన్నికలలో సొంత నియోజకవర్గం కుప్పం ప్రజలు కూడా ఆయనను తిరస్కరించారన్నారు. ఈ విజయంతో జగన్మోహన్ రెడ్డిపై ప్రజలకున్న విశ్వాసం రోజురోజుకు రెట్టింపవుతుందన్నారు. అందుకు నిదర్శనమే ఇప్పటి ఫలితాలని ఆయన పేర్కొన్నారు. 



Updated Date - 2021-11-17T22:16:35+05:30 IST