ఎవరికో పల్లకి మోయడం పవన్ సిద్ధాంతం: మంత్రి సురేష్

ABN , First Publish Date - 2022-04-19T17:15:06+05:30 IST

ఎవరైనా పార్టీ పెట్టినప్పుడు ఒక జెండా, ఒక అజెండా, ఒక సిద్ధాంతం ఉంటాయని...అయితే ఎవరికో పల్లకి మోయడం పవన్ సిద్ధాంతమంటూ మంత్రి ఆదిమూలపు సురేష్ వ్యాఖ్యలు చేశారు.

ఎవరికో పల్లకి మోయడం పవన్ సిద్ధాంతం: మంత్రి సురేష్

ప్రకాశం: ఎవరైనా పార్టీ పెట్టినప్పుడు ఒక జెండా, ఒక అజెండా, ఒక సిద్ధాంతం ఉంటాయని... అయితే ఎవరికో పల్లకి మోయడం పవన్ సిద్ధాంతమంటూ మంత్రి ఆదిమూలపు సురేష్ వ్యాఖ్యలు చేశారు. మంగళవారం మీడియాతో మాట్లాడుతూ...  సీఎం జగన్ ఫోటోతో తాము ఎన్నికల్లో గెలిచామని అన్నారు. మంత్రి పదవికి రాజీనామా చేసి తామంతా క్యాబినెట్ మీటింగ్ నుండి సంతోషంగా బయటకు వచ్చామని తెలిపారు. పాత కొత్త కలయికతో సీఎం జగన్ మంత్రి వర్గం ఏర్పాటు చేశారని చెప్పారు. .మంత్రి పదవి రాక బాధపడిన వాళ్లంతా సర్థుకున్నారన్నారు. కొత్త మంత్రులు రెట్టింపు ఉత్సాహంతో పని చేస్తున్నారని అన్నారు. 

Updated Date - 2022-04-19T17:15:06+05:30 IST