ఎరువుల ధరలను తగ్గించాలి: మంత్రి అల్లోల

ABN , First Publish Date - 2022-01-13T21:42:21+05:30 IST

దేశంలో పెంచిన ఎరువుల ధరలను తగ్గించాలని కేంద్ర

ఎరువుల ధరలను తగ్గించాలి: మంత్రి అల్లోల

నిర్మల్: దేశంలో పెంచిన ఎరువుల ధరలను తగ్గించాలని కేంద్ర ప్రభుత్వాన్ని మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి డిమాండ్ చేశారు. నిర్మల్‌లో ఆయన మీడియాతో మాట్లాడారు. రైతులను నష్టపరిచే విధంగా వ్యవహరిస్తున్న బీజేపీకి రాబోయే ఎన్నికల్లో తగిన గుణపాఠం చెబుతారని ఆయన అన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ రాసిన లేఖకు ప్రధాని వెంటనే జవాబు చెప్పాలన్నారు. భారతదేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా తెలంగాణలోనే రైతులు ఆనందంగా ఉన్నారని ఆయన పేర్కొన్నారు. కేంద్ర ప్రభుత్వం అవలంభిస్తున్న రైతు వ్యతిరేక విధానాలను ఉపేక్షించేది లేదని ఆయన హెచ్చరించారు. 


Updated Date - 2022-01-13T21:42:21+05:30 IST