Minister: పాఠశాలల్లో ‘పఠనా ఉద్యమం’ ప్రారంభం
ABN , First Publish Date - 2022-08-18T16:29:16+05:30 IST
రాష్ట్ర పాఠశాల విద్యాశాఖ ఆధ్వర్యంలో పాఠశాలల్లో ‘పఠనా ఉద్యమం’ పథకాన్ని అమలు చేయనున్నట్లు ఆ శాఖ మంత్రి అన్బిల్ మహేష్(Minister Anbil
- మంత్రి అన్బిల్ మహేష్
ప్యారీస్(చెన్నై), ఆగస్టు 17: రాష్ట్ర పాఠశాల విద్యాశాఖ ఆధ్వర్యంలో పాఠశాలల్లో ‘పఠనా ఉద్యమం’ పథకాన్ని అమలు చేయనున్నట్లు ఆ శాఖ మంత్రి అన్బిల్ మహేష్(Minister Anbil Mahesh) పేర్కొన్నారు. తిరుచ్చిలోని ప్రభుత్వ సయ్యద్ ముత్తుషా మహోన్నత పాఠశాలలో బుధవారం పఠనా ఉద్యమం పథకాన్ని మంత్రి పరిచయం చేశారు. విద్యార్థుల్లో పఠనాశక్తి పెంపొందించుకొనేలా అవగాహన గైడ్ కూడా మంత్రి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ, ఒక్కోక్క పాఠశాలలో ఉన్న విద్యార్థులను 6-7, 9,10, 11-12 మూడు విభాగాలుగా విభజించి అందరికీ గ్రంథాలయాల్లో ఉన్న పుస్తకాల్లో వారానికి ఒకటి అందిస్తామని, విద్యార్థులు(Students) ఆ పుస్తకం ఇంటికి తీసుకెళ్లి చదివిన అనంతరం మళ్లీ గ్రంథాలయాలకు అప్పగించాలని తెలిపారు.