సహాయక చర్యలు ముమ్మరం చేయాలి: అనిల్
ABN , First Publish Date - 2020-11-27T01:41:42+05:30 IST
ఇరిగేషన్ అధికారులతో మంత్రి అనిల్ వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సమావేశంలో నివర్ తుపాను ప్రభావంతో చెరువులకి గండి పడకుండా చూడాలని అధికారులను ఆదేశించారు.
అమరావతి: ఇరిగేషన్ అధికారులతో మంత్రి అనిల్ వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సమావేశంలో నివర్ తుపాను ప్రభావంతో చెరువులకి గండి పడకుండా చూడాలని అధికారులను ఆదేశించారు. లోతట్టు ప్రాంతాల్లోని ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించాలని, సహాయక చర్యలు ముమ్మరం చేయాలని, అధికారులు ప్రజలకు అందుబాటులో ఉండాలని ఆయన చెప్పారు. బాధితులకు సకాలంలో ఆహారం, తాగునీరు, మందులు సరఫరా చేయాలని చెప్పారు.