ఏ ఎన్నికైనా వైసీపీదే గెలుపు: మంత్రి అవంతి
ABN , First Publish Date - 2021-04-19T23:50:28+05:30 IST
రాష్ట్రంలో ఏ ఎన్నికైనా వైసీపీదే గెలుపని మంత్రి అవంతి శ్రీనివాస్
విశాఖ: రాష్ట్రంలో ఏ ఎన్నికైనా వైసీపీదే గెలుపని మంత్రి అవంతి శ్రీనివాస్ అన్నారు. విశాఖలో ఆయన ఈ రోజు మాట్లాడుతూ చంద్రబాబుకు ఓటమిని ఒప్పుకునే ధైర్యం లేదని అవంతి ఎద్దేవా చేశారు. అప్పట్లో నేతలను చంద్రబాబు తిట్టేవారని, కానీ ఇప్పుడు ప్రజలను తిడుతున్నారని ఆయన చంద్రబాబుపై ధ్వజమెత్తారు. జగన్కు ఓటేస్తే చెడ్డవాళ్లు, టీడీపీకి ఓటేస్తే మంచివాళ్లా అని చంద్రబాబును అవంతి ప్రశ్నించారు. భవిష్యత్తులో టీడీపీ పరిస్థితి ఏంటో అచ్చెన్నాయుడే చెప్పారని అవంతి శ్రీనివాస్ పేర్కొన్నారు.