విశాఖ అభివృద్ధికి ప్రతిపక్షాలు అడ్డుపడుతున్నాయి
ABN , First Publish Date - 2021-08-10T01:47:57+05:30 IST
విశాఖ అభివృద్ధికి ప్రతిపక్షాలు అడ్డుపడుతున్నాయని మంత్రి అవంతి శ్రీనివాస్
విశాఖ: విశాఖ అభివృద్ధికి ప్రతిపక్షాలు అడ్డుపడుతున్నాయని మంత్రి అవంతి శ్రీనివాస్ ఆరోపించారు. హరిత రిసార్ట్పై కావాలనే టీడీపీ అసత్య ప్రచారం చేస్తోందని ఆయన విమర్శించారు. హరిత రిసార్ట్ ప్రాంతంలో ఫైవ్ స్టార్ ప్లస్ హోటల్ నిర్మిస్తున్నామని ఆయన తెలిపారు. గతంలోనే దీనిపై ప్రభుత్వ ఉత్తర్వులు కూడా ఇచ్చామన్నారు. తొలి దశలో రూ.92 కోట్లు, రెండో దశలో రూ.72 కోట్లు మంజూరు చేయాలని నిర్ణయించామన్నారు. సీఎం జగన్, ఎంపీ విజయసాయిరెడ్డిలపై ఇష్టానుసారంగా విమర్శలు చేస్తున్నారని మంత్రి అవంతి శ్రీనివాస్ ఆరోపించారు.