పాపికొండల విహారయాత్ర బోట్లను ప్రారంభించిన మంత్రి అవంతి

ABN , First Publish Date - 2021-11-07T20:03:22+05:30 IST

రెండేళ్ల విరామం తర్వాత పాపికొండల విహారయాత్ర పూర్తిస్థాయిలో పునః ప్రారంభమైంది.

పాపికొండల విహారయాత్ర బోట్లను ప్రారంభించిన మంత్రి అవంతి

రాజమండ్రి: రెండేళ్ల విరామం తర్వాత పాపికొండల విహారయాత్ర పూర్తిస్థాయిలో పునః ప్రారంభమైంది. టూరిజం మంత్రి అవంతి  శ్రీనివాసరావు పాపికొండల బోట్లను ప్రారంభించారు. గండిపోశమ్మ ఆలయం నుంచి పాపికొండల విహారయాత్రకు రెండు బోట్లు బయలుదేరాయి.


ఈ సందర్భంగా మంత్రి అవంతి శ్రీనివాస్ మాట్లాడుతూ ముఖ్యమంత్రి ఆదేశాల ప్రకారం భద్రతా పరమైన చర్యలు తీసుకున్నామని, టూరిస్టులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా పోలీసులు, టూరిజం, ఇరిగేషన్ అధికారులు, సిబ్బంది సహకరిస్తారన్నారు. జీపీఎస్.. సాటిలైట్ సిస్టంతో.. చిన్న పిల్లల దగ్గర నుంచి ప్రయాణికులు అందరూ లైఫ్ జాకెట్స్ ధరించి టూరిజం సిబ్బందికి సహకరించాలని సూచించారు. ఫ్లైట్ ఎక్కేటప్పుడు ఏ విధంగా సీట్ బెల్ట్ పెట్టుకుంటారో బోట్ ఎక్కి..దిగే వరకు కూడా అదే విధంగా ప్రయాణికులు సీట్ బెల్ట్ పెట్టుకోవాలన్నారు. ప్రభుత్వ పరంగా అన్ని ఏర్పాట్లు చేశామన్నారు. ప్రస్తుతం 11 బొట్లకు పర్మిషన్ ఇవ్వడం జరిగిందని, మిగిలిన బొట్లకు త్వరలోనే పర్మిషన్ ఇస్తామన్నారు.

Updated Date - 2021-11-07T20:03:22+05:30 IST