అమరావతి రాజధానిలో గోల్మాల్ జరిగింది: మంత్రి బొత్స
ABN , First Publish Date - 2022-03-08T19:17:56+05:30 IST
అమరావతి రాజధానిలో గోల్మాల్ జరిగిందని మంత్రి బొత్స సత్సనారాయణ అన్నారు.
విజయవాడ: అమరావతి రాజధానిలో గోల్మాల్ జరిగిందని మంత్రి బొత్స సత్సనారాయణ అన్నారు. మంగళవారం ఆయన ఇక్కడ మీడియాతో మాట్లాడుతూ సీఆర్డీఏ చట్టం ప్రకారం ముందుకు వెళతామని స్పష్టం చేశారు. అమరావతి రైతులకు ఇచ్చిన హామీలను పూర్తిగా నెరవేరుస్తామన్నారు. అమరావతిని శాసన రాజధానిగా నిర్ణయించుకున్నామని, 2024 వరకు ఉమ్మడి రాజధానిగా హైదరాబాద్ ఉంటుందని మంత్రి బొత్స సత్యనారాయణ వ్యాఖ్యానించారు.