AP News: సీఎం జగన్‌తో మంత్రి బొత్స భేటీ

ABN , First Publish Date - 2022-05-10T18:22:23+05:30 IST

ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డితో విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ మంగళవారం భేటీ అయ్యారు.

AP News: సీఎం జగన్‌తో మంత్రి బొత్స భేటీ

అమరావతి: ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి(Jagan mohan reddy)తో విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ(Botsa satyanarayana) మంగళవారం భేటీ అయ్యారు. మాజీ మంత్రి, టీడీపీ నేత నారాయణ అరెస్ట్, పదవ తరగతి ప్రశ్నాపత్నం లీక్‌పై ప్రధానంగా చర్చ జరుగుతోంది. మరికాసేపట్లో నారాయణ(Narayana) అరెస్ట్‌పై మంత్రి బొత్స స్పందించే అవకాశం ఉంది. 


కాగా...మాజీ మంత్రి నారాయణను ఏపీ సీఐడీ అధికారులు కాసేపటి క్రితమే అదుపులోకి తీసుకున్న సంగతి తెలిసిందే. హైదరాబాద్‌ కొండాపూర్‌లోని నారాయణ నివాసంలోనే అదుపులోకి తీసుకుని.. ఆయన కారులోనే ఏపీకి తరలిస్తున్నారు. అయితే.. టెన్త్‌ పేపర్ లీకేజీ వ్యవహారంలోనే సీఐడీ అదుపులోకి తీసుకుంది. 

Read more