ప్రతిపక్షాలు రాద్ధాంతం చేస్తుంటాయి: మంత్రి బొత్స

ABN , First Publish Date - 2021-12-22T00:00:22+05:30 IST

రాష్ట్రంలోని ప్రతిపక్షాలు కావాలనే రాద్ధాంతం చేస్తుంటాయని మంత్రి

ప్రతిపక్షాలు రాద్ధాంతం  చేస్తుంటాయి: మంత్రి బొత్స

విజయవాడ: రాష్ట్రంలోని  ప్రతిపక్షాలు కావాలనే రాద్ధాంతం  చేస్తుంటాయని మంత్రి బొత్స సత్యనారాయణ అన్నారు. వారు పని చేయరు.. చేసే వాళ్లను చేయనివ్వరని ప్రతిపక్షాలపై ఆగ్రహం వ్యక్తం చేశారు. నగరంలో  పలు అభివృద్ధి  కార్యక్రమాల పనులను ప్రారంభించారు. అనంతరం ఎర్రకట్ట వద్ద వైఎస్ ఆర్ విగ్రహాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వం చేస్తున్న మంచి కార్యక్రమాలను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. 


జగనన్న శాశ్వత గృహ  పథకాన్ని విమర్శించడం సిగ్గుచేటన్నారు. ఇళ్ల పట్టాలు ఇస్తే కోర్టుకు వెళ్లి స్టే తెస్తున్నారని  ప్రతిపక్ష నాయకులపై ఆరోపణలు గుప్పించారు. తాము ఓటేసిన ప్రజలకు  జవాబుదారీతనంగా‌ ఉంటామని ఆయన స్పష్టం చేశారు. ఒక్క రూపాయి కూడా కట్టొద్దని చెప్పడానికి అచ్చెన్నాయడు ఎవరని ఆయన ప్రశ్నించారు. గతంలో చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఎందుకు చేయలేదని ఆయన నిలదీశారు. ప్రజలకు మంచి జరగాలని సీఎం జగన్ ఆలోచిస్తున్నారన్నారు. ఓటీఎస్‌పై తాము ఎవరినీ బలవంతం చేయలేదని ఆయన స్పష్టం చేశారు. 

Updated Date - 2021-12-22T00:00:22+05:30 IST